- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాగిన మత్తులో కరెంట్ స్తంభాలను ఢీకొట్టిన డ్రైవర్.. చివరికి ఏమైందంటే?
తాగిన మత్తులో లారీని నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ శ్రీవారి కొండపైకి వెళ్లే ఆర్చిగేటు కూడలిలోని విద్యుత్ స్తంభాలను ఢీకొట్టాడు

X
దిశ, ద్వారకాతిరుమల: తాగిన మత్తులో లారీని నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ శ్రీవారి కొండపైకి వెళ్లే ఆర్చిగేటు కూడలిలోని విద్యుత్ స్తంభాలను ఢీకొట్టాడు. దీంతో రెండు స్తంభాలు నేలకొరిగాయి. ఆ సమయంలో అటు ఏ విధమైన వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. భీమడోలు వైపు నుంచి ద్వారకాతిరుమల కు వచ్చిన లారీ కామవరపుకోట వైపు వెళ్లబోయి.. కొండపైకి వెళ్లే ఆర్చిగేటు వద్దకు వచ్చింది. మళ్లీ కామవరపుకోట కి వెళ్లే క్రమంలో లారీ డ్రైవర్ యూటర్న్ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అమాంతం రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టాడు. విద్యుత్ వైర్లు షార్ట్ అయ్యి పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు.
Next Story






